BREAKING : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు

-

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదు అయింది. మంగళహాట్ పోలీస్ స్టేషన్లో రాజసింగ్ పై కేసు నమోదు అయింది. ఈనెల 6వ తేదీన తన ట్విట్టర్ ఖాతాలో అయోధ్య పై పోస్టు చేసిన రాజాసింగ్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సంజాయిషీ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు మంగళహాట్ పోలీసులు.

పిడి యాక్ట్ కొట్టేస్తూ హైకోర్టు విధించిన షరతులను ఉల్లంఘించారని నోటీసుల్లో పేర్కొన్నారు మంగళహాట్ పోలీసులు. అయితే… నోటీసులకు రాజసింగ్ తరపు న్యాయవాది సంజాయిషీ ఇచ్చారు. నోటీసుల్లో పేర్కొన్న అంశాలు సంతృప్తికరంగా లేవని పేర్కొన్నారు మంగళహాట్ పోలీసులు. ఈ నేపథ్యంలోనే, 295-A ఐపిసి సెక్షన్ కింద కేసు నమోదు చేశారు మంగళహాట్ పోలీసులు.

అటు మంగళహాట్ పోలీసులు కేసు నమోదు చేయడంపై స్పందించిన రాజాసింగ్.. బాబ్రీ మసీదు పై ఓవైసీ సోదరులు సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు.
వాళ్లపై ఎందుకు కేసు నమోదు చేయాలని ప్రశ్నించిన రాజాసింగ్.. కెసిఆర్, కేటీఆర్, ఓవైసీ సోదరుల మెప్పు పొందేందుకు పోలీసులు పోటీపడి తనపై కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news