నేను లోకేష్ రెగ్యులర్ గా మాట్లాడుకుంటాం: మంత్రి కేటీఆర్

-

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా నేతలపై వస్తున్న ఆరోపణలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ తమపై మచ్చ లేకుండా రాకుండా జాగ్రత్త చూసుకుంటున్నారు. తాజాగా కేటీఆర్ పై మీడియాలో వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో తెలంగాణాలో ధర్నాలు నిరసనలు తెలుపుతుండగా ఇక్కడ ఏమిటి మీరు చేసేది అక్కడకెళ్లి చేసుకోండి అంటూ కేటీఆర్ అన్న వ్యాఖ్యలపై మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ పూర్తిగా రాజకీయ శత్రుత్వంతో కూడుకున్నది అని తెలిసిందే, దాని గురించి తెలంగాణాలో హైలైట్ చేస్తే గొడవలు జరిగే అవకాశం ఉంది అందుకే నేను వద్దని చెప్పను అంటూ మంత్రి కేటీఆర్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.

నేను చెప్పిన విధానం బాగలేదేమో కానీ.. ఉద్దేశ్యం మాత్రం అదేనంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. నేను లోకేష్ రెగ్యులర్ గా మాట్లాడుకుంటాం, ఇక జగన్ మరియు పవన్ కళ్యాణ్ లతోనూ నాకు మంచి స్నేహం ఉంది. అయినా రాజకీయాలు వేరు మరియు స్నేహం రెండూ వేరు అంటూ క్లారిటీ ఇచ్చారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news