Chiranjeevi : మెగా మేనియా షురూ.. నెలల తేడాతో చిరంజీవి సినిమాల విడుదల

-

సెల్ఫ్ మేడ్ మ్యాన్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ప్రజెంట్ వరుస సినిమాలతో యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తున్నాడు. ఒకేసారి ఐదు ఫిల్మ్స్ ను సెట్స్ పైకి తీసుకెళ్లిన హీరోగా ఆయన రికార్డు క్రియేట్ చేశారు. ఈ నేపథ్యంలోనే అతి త్వరలో మెగా మేనియా స్టార్ట్ కాబోతుందేని మెగా అభిమానులు అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తు్న్నారు.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ- చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేశారు. ఈ క్రమంలోనే తండ్రీ తనయులు చిరంజీవి, చరణ్ లను వెండితెరపైన చూసేందుకు అభిమానులు ఆత్రుతగా ఉన్నారు.  ‘ఆచార్య’ చిత్రం నుంచి మెగా మేనియా మొదలవుతున్నదని చెప్పొచ్చు. ఈ సినిమా విడుదల తర్వాత నెలల గ్యాప్ లోనే చిరంజీవి సినిమాలు వరుసగా విడుదల అయేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

‘ఆచార్య’ చిత్రం తర్వాత నెలల తేడాతోనే అనగా అక్టోబర్ నెలలో దసరా కానుకగా ‘భోళా శంకర్’ మూవీ రిలీజ్ చేయానుకుంటున్నట్లు సమాచారం. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పిక్చర్ కోలీవుడ్ ఫిల్మ్ ‘వేదాళం’ రీమేక్. కాగా, ఇందులో ఫిమేల్ లీడ్ రోల్ ను తమన్నా భాటియా ప్లే చేస్తోంది. చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుంది. ఇక ‘భోళా శంకర్’ ఫిల్మ్ తర్వాత మెగాస్టార్ నటించిన ‘గాడ్ ఫాదర్’ మూవీ రిలీజ్ కానుంది.

వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ‘గాడ్ ఫాదర్’ ఉంటుందని అంటున్నారు మెగా అభిమానులు. ఈ చిత్రం విడుదలయిన నెలల వ్యవధిలోనే మెగాస్టార్ చిరు- బాబీ కాంబో మూవీ ‘మెగా 154’, ఆ తర్వాత యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల- చిరంజీవి సినమా ఉంటుంది. కాగా, మెగా మేనియా షురూ కాబోతున్నదని తెలుసుకుని అభిమానులు, సినీ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news