సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై లోకేష్ సంచలన ట్వీట్.. పేలని జ”గన్” అంటూ…!

-

ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్న సంగతి తెలిసిందే. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన పై టీడీపీ కీలక నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ సంచలన ట్వీట్ చేశారు. పేలని జ “గన్” హస్తిన పయనం ఎందుకు అంటూ ఓ పోస్టర్ విడుదల చేశారు నారా లోకేష్.

బాబాయ్ హత్య కేసులో దొరికిన అవినాష్రెడ్డి తప్పించేందుకా, తాను కొట్టేస్తే కాగ్ పట్టేసిన రూ. 48 వేల కోట్ల వ్యవహారాన్ని కామప్ చేయాలని వెళ్తున్నారా అంటూ చురకలంటించారు. తనపై సిబిఐ, ఈడి కేసుల దర్యాప్తు ఆపేయాలని, లేదా లక్షల కోట్ల ఆస్తి లో చెల్లికి చిల్లిగవ్వ కూడా దక్కకుండా మహిళలకు ఆస్తి హక్కు రద్దు చేయాలని కోరేందుకు ఢిల్లీకి వెళ్తున్నారా అంటూ సెటైర్లు పిలిచారు నారా లోకేష్. కాగా ఇవాళ సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news