సీనియర్ జర్నలిస్టు రామ్మోహన్ నాయుడుని పరామర్శించిన మెగాస్టార్..!

-

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. గత మూడు నెలల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రీ రామ్మోహన్ నాయుడును మెగాస్టార్ చిరంజీవి ఆదివారం పరామర్శించారు. ఆయనకు ఆరోగ్యం బాగా లేదన్న విషయం తెలిసిన వెంటనే చిరంజీవి స్వయంగా ఇంటికి వెళ్లారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక ఆయనకు ధైర్యం చెప్పడమే కాకుండా, స్వస్థత చేకూరేందుకు అన్ని రకాలుగా ఆదుకుంటామని చిరంజీవి హామీ ఇచ్చారు. వెంటనే ఆయనకు మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్ AIG హాస్పిటల్‌లో ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు.

Chiranjeevei
Chiranjeevei

శ్రీ రామ్మోహన్ నాయుడు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నమ్మిన సిద్ధాంతం ప్రకారం ఉన్నది ఉన్నట్లుగా రాసే వారని తెలిపారు. ఇక జర్నలిస్టుగా శ్రీ రామ్మోహన్ నాయుడుకి ఎంతో పేరు ఉందని ఈ సందర్భంగా చిరంజీవి గుర్తుచేశారు. ఇలా నిబద్ధత కలిగిన పాత్రికేయులను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఎంతో ఉందన్నారు. శ్రీ రామ్మోహన్ నాయుడు త్వరితగతిన కోలుకోవాలని, యధా ప్రకారం పనిచేయాలని మెగాస్టార్ చిరంజీవి కోరుకున్నారు.

ఇక చిరంజీవి ఓ పక్క ఆచార్య షూటింగ్ బిజీ, మరోపక్క నిహారిక వివాహ వేడుకలతో, క్షణం తీరిక లేకుండా ఉన్నారు. అయ్యినప్పటికీ ఓ జర్నలిస్టు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని తెలిసి ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శమని ఆయన అభిమానులు కొనియాడారు. కాగా సమకాలీన సమాజానికి కావాల్సిన విలువైన రాజకీయం కోసం మెగాస్టార్ చిరంజీవితో ప్రజారాజ్యం పార్టీలో రామ్మోహన్ నాయుడు చురుగ్గా పని చేశారు. చిరంజీవి ఆకాంక్షించినట్లు శ్రీ రామ్మోహన్ నాయుడు త్వరగా ఆరోగ్య సమస్యల నుంచి బయట పడాలని అఖిల భారత చిరంజీవి యువత కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news