చంద్రబాబు చేసిన తప్పులకే ఇప్పుడు శిక్షను అనుభవిస్తున్నాడు : మంత్రి అమర్నాథ్‌

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన తప్పులకే ఇప్పుడు శిక్షను అనుభవిస్తున్నాడు అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆయనపై కావాలని ప్రభుత్వం కక్షగట్టి కేసులు ఎందుకు పెడుతుందని మంత్రి చెప్పుకొచ్చారు. ఒక వేళ మేము చంద్రబాబు మీద పగతీర్చుకోవాలనుకుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనపై అక్రమ కేసులు పెట్టేవాళ్లం కదా అంటూ అడిగారు. చంద్రబాబు తరపున పెద్ద పెద్ద లాయర్ల వాదిస్తున్నారు.. చంద్రబాబు తప్పు చేయకుంటే ఆయనకు ఎందుకు భయం.. బాబుపై ఉన్న ఆరోపణలు నిజం కాబట్టే ఈ కేసు ఇంకా కొనసాగుతుంది అని మంత్రి పేర్కొన్నారు. ప్రజల సొమ్మును చంద్రబాబు దొచుకోవడం వల్లే ఇప్పుడు శిక్షను అనుభవిస్తున్నాడు అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.

YSRCP MLA Gudivada Amarnath Reddy Fires On TDP leader Chandrababu Naidu -  Sakshi

దసరా నుంచి విశాఖ కేంద్రంగా సీఎం జగన్ పరిపాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. ప్రతిపక్షాలు ఎన్నో అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశాయన్నారు. సీఎం జగన్ విశాఖ నుంచి పరిపాలించడానికి ఏ వ్యవస్థ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. సీఎంతో పాటు మంత్రులు, అధికారులకు కావాల్సిన ఏర్పాట్ల కోసం కేబినెట్ సమావేశంలో ఓ కమిటీ వేశామన్నారు మంత్రి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news