మేడారంలో అరుదైన ఘ‌ట‌న‌.. మంత్రి ఎర్ర‌బెల్లి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముచ్చ‌ట

-

మేడారం జాత‌ర‌లో అరుదైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎదురెదురుగా క‌లుసుకున్నారు. ఇద్ద‌రు.. ఒక‌రినొక‌రు న‌వ్వుతు ప‌లిక‌రించుకున్నారు. కాసేపు ఇద్ద‌రు ముచ్చ‌టించుకున్నారు. కాగ ఈ దృశ్యం చూడ‌టానికి సాధార‌ణంగా ఉన్నా.. గ‌త కొద్ది రోజుల నుంచి టీఆర్ఎస్ – బీజేపీ ల మ‌ధ్య యుద్ద వాతావ‌ర‌ణం నెల‌కొంది. విమ‌శ్రన‌స్త్రాల‌తో కాలు దువ్వుతున్నారు. ప్ర‌ధాని మోడీపై, కేంద్ర మంత్రుల‌తో పాటు కిషన్ రెడ్డిపై కూడా మంత్రులు, టీఆర్ఎస్ నాయ‌కులు తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు.

కిషన్ రెడ్డి కూడా సీఎం కేసీఆర్ పై తెలంగాణ రాష్ట్ర మంత్రుల‌పై విమ‌ర్శ బాణాల‌ను సందిస్తున్నారు. ఇలాంటి సంద‌ర్భంలో వీరు క‌లుసుకుని మాట్లాడుకోవ‌డం.. ప్ర‌స్తుతం చ‌ర్చ‌ల‌కు దారి తీస్తుంది. రాజ‌కీయం రాజ‌కీయ‌మే.. ఆధ్యాత్మికం ఆధ్యాత్మికమే అని ప‌లువురు అంటున్నారు. కాగ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేడారంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. దీనికి ముందు మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, మ‌ల్లారెడ్డి, త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాదవ్ మేడారం జాత‌రను సంద‌ర్శించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news