తండ్రిని మించిన దుర్మార్గుడు సిఎం జగన్ : మంత్రి జగదీష్ రెడ్డి

-

ఏపీ సిఎం జగన్ ప్రధానికి లేఖ రాయడంపై మండిపడ్డారు మంత్రి జగదీష్ రెడ్డి. తండ్రిని మించిన దుర్మార్గుడు సిఎం జగన్ అని..సమస్యను సృష్టించిందే ఆంధ్రా సర్కార్ అని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ నీటి అవసరాలు పట్టవా ? కోర్టుకిచ్చిన మాటను తప్పిందేవరు అని ప్రశ్నించారు. సర్వేల పేరిట నిర్మాణాలు కొనసాగిస్తోంది నిజం కాదా? జీవోల పేరిట చిలక పలుకులు పలుకుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణ అవసరాల కోసం ఒక్క జీవోను ఇచ్చారా? మద్రాస్ కు మంచినీటి పేరుతో వైఎస్ రాజశేఖరరెడ్డి కృష్ణా నీళ్లను దోచుకున్నారని పేర్కొన్నారు.

సాగర్ ఎడమ కాలువ కింద రైతాంగానికి 50 ఏండ్లు ద్రోహమే చేశారని.. ఏడేండ్ల కరువులోను కృష్ణాడెల్టా కు నీళ్లు వదిలారన్నారు. ఎడమ కాలువ ఎట్టుమీద కుడికాలువ కింది భాగంలో ఉందని.. హుకుంలు జారీ చేయడం, దౌర్జన్యం, బెదిరింపులతో శ్రీశైలం, సాగర్ గేట్లు తెరిపించారని మండిపడ్డారు. ఆడుకుంటాం, వాడుకుంటాం అంటే ఊరుకునేది లేదని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణా హక్కుల్ని ఎవరూ హరించ లేరని హెచ్చరించారు.

చట్టపరంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని.. శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టిందే జలవిద్యుత్ ఉత్పత్తి కోసమని.. రైతులు ఎక్కడైనా రైతులేన్నారు. ఇరు రాష్ట్రాలకు పనికి వచ్చే ఫార్ములాను ముందుకు తెచ్చిందే ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. ఆ ఫార్ములాను పక్కన పెట్టి అహంకారంతో పోతున్నారని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news