వైసీపీకి ఓటు వేయకపోతే తప్పు చేసినట్లే : మంత్రి జోగి రమేశ్

-

బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి వైసీపీ సర్కార్ కృషి చేస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేస్తున్న వైసీపీకి బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఓటు వేయకపోతే తప్పు చేసినట్లేనని వ్యాఖ్యానించారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం పెదమద్దూరు వద్ద రూ.44 కోట్లతో అమరావతి-తుళ్లూరు రహదారి, పెదమద్దూరు వాగుపై వంతెన నిర్మాణ పనులకు నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు నంబూరు శంకరరావు, ఉండవల్లి శ్రీదేవిలతో కలిసి శంకుస్థాపన చేశారు.

10 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో కృష్ణా నదిపై త్వరలోనే వంతెన నిర్మాణం చేపట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని మంత్రి జోగి రమేశ్ చెప్పారు. అమాయక యువతను పవన్‌ కల్యాణ్‌ లాంటి వారు రెచ్చగొడుతున్నారని ఆక్షేపించారు.

Read more RELATED
Recommended to you

Latest news