మునుగోడు గెలుపుపై ఎమ్మెల్యే పెద్ది & టీం కి అభినందనలు తెలిపిన మంత్రి కేటీఆర్

-

మునుగోడు గెలుపుపై ఎమ్మెల్యే పెద్ది & టీం కు ప్రత్యేక అభినందనలు తెలిపారు మంత్రి కేటీఆర్. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా కిష్టాపురం, చల్లెడు ఎంపిటిసిల ఇంచార్జ్ గా వ్యవహరించి టీఆర్ఎస్ కు భారీ మెజారిటి సాదించి, పార్టీ విజయానికి కృషి చేసిన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మరియు అతనితో కలిసి పనిచేసిన నాయకులు, కార్యకర్తలను మంత్రి & టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్ అభినందించారు.

ఈరోజు హైదరాబాద్ లో మంత్రి కే.టీ.ఆర్ ని కలిసి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శభాష్ ఎమ్మెల్యే సాబ్ బాగా పనిచేసారంటూ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేకు కితాబిచ్చారు. ఎన్నికలలో కిష్టాపురం ఎంపిటిసితో పాటు ప్రత్యేకంగా పనిచేసిన చల్లేడు ఎంపిటిసి ప్రాంతంలో కూడా భారీ మెజారిటీ తీసుకొచ్చిన టీమ్ అందరికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక అభినందనలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ మాలోతు కవిత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, తదితరులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news