మెడికల్ కాలేజీ తెచ్చుకోలేని దద్దమ్మ బండి సంజయ్ – మంత్రి ఎర్రబెల్లి

-

బిజెపి నేతలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మునుగోడు ప్రజలు బీజేపీకి, కేంద్ర ప్రభుత్వనికి బుద్ధి చెప్పినట్లు తీర్పునిచ్చారన్నారు. బీజేపీ పార్టీ రాజగోపాల్ రెడ్డి ని 18 వేల కోట్లకు కొని ఆయనను బలి పశువును చేసిందని ఆరోపించారు.

మునుగోడు ఎన్నికల కోసం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని అడ్డు పెట్టుకొని నాటకం ఆడారని మండిపడ్డారు మంత్రి ఎర్రబెల్లి. మునుగోడు ప్రజలు వారి నాటకాలకి తెరదించారని అన్నారు. మునుగోడు లో బిజెపి ఇచ్చిన హామీలను దేశం మొత్తం అమలు చేయాలని, ఆ మేరకు బిజెపి ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి మాట్లాడాలని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తేలేని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సిగ్గు లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

కరీంనగర్ లో కనీసం ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చుకోలేని దద్దమ్మ బండి సంజయ్… ఎక్కువ మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాలను ప్రైవేట్ పరం చేయాలి అని చూస్తున్నదని ఆరోపించారు. ధరలు పెరుగుదలకు ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వమేనన్నారు. అమిత్ షా, రాజగోపాల్ రెడ్డి ప్లాన్ చేసి తెలంగాణ లో చిచ్చు పెట్టడానికే ఈ ఎన్నికలు తెచ్చారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news