గోవా ట్రిప్ లో మంత్రి కేటీఆర్ ఫ్యామిలీ

-

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ప్రస్తుతం గోవా టూర్ లో ఉన్నారు. ఫ్యామిలీ తో పాటు.. గోవా వెళ్లిన మంత్రి కేటీఆర్..అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా గోవాలో ఆయన రోడ్ సైడ్ షాపింగ్ చేశారు. తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా గోవా టూర్ వెళ్లిన మంత్రి కేటీఆర్… ఫ్యామిలీతో కలిసి లోకల్ బజార్ షాపింగ్ చేశారు. అంతేకాదు అక్కడ షాపింగ్ చేసిన ఫోటోలతో పాటు చిరు వ్యాపారులతో… సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మంత్రి కేటీఆర్.

దీంతో మంత్రి కేటీఆర్ షేర్ చేసిన ఆ ఫోటోలు… సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా… రెండు రోజుల నుంచి తీన్మార్ మల్లన్న వర్సెస్ టిఆర్ఎస్ పార్టీ గా వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు పై తీన్మార్ మల్లన్న నిర్వహించిన పోల్ పెద్ద దుమారమే లేపింది. అంతేకాదు టిఆర్ఎస్ అనుచరులు ఏకంగా తీన్మార్ మల్లన్న ఆఫీస్ కు వెళ్లి అతన్ని కొట్టారు. ప్రస్తుతం ఈ వివాదం ఇంకా చెలరేగుతోంది. అటు బిజెపి పార్టీ తీన్మార్ మల్లన్న కు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news