మల్లారెడ్డి సవాల్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఎపిసోడ్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. మల్లారెడ్డి సవాల్ చేసినట్టు రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కేటీఆర్‌ కూడా సవాల్‌ విసిరారు. గజ్వేల్ ఆడా ఈడా ఎందుకు … అక్కడే తేల్చుకో ? అని రేవంత్‌ కు సవాల్‌ విసిరారు. కొడంగల్ లో తన్ని తరిమేశారని… చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టు మల్కాజ్ గిరి లో గెలిచాడని ఫైర్‌ అయ్యారు.

ktr
ktr

నీ స్థాయీ… బతుకు ఎంటో అందరికీ తెలుసని…. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ఫ్రాంచైజ్ అయిపోయిందని కేటీఆర్‌ చురకలు అంటించారు. రేవంత్ ను ముందు పెట్టి నడిపిస్తున్నారని… చంద్ర బాబు తోలు బొమ్మ ఆటలో బొమ్మ రేవంత్ అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ముందు… మంత్రి మల్లారెడ్డి సవాల్ పై మాట్లాడి.. ఆ తర్వాత గజ్వేల్ సభ గురించి మాట్లాడితే మంచిదని మండి పడ్డారు. టీ కాంగ్రెస్ ను చంద్రబాబు.. ఫ్రాంచైజీ లెక్క తీసుకున్నాడని.. చిలక మనదే అయినా ..మాట్లాడిస్తున్నది మాత్రం చంద్రబాబు అని ఎద్దేవా చేశారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news