మంత్రి మేకపాటి దిగిన చివరి సెల్పీ వైరల్‌ !

-

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి.. ఇవాళ మృతి చెందిన సంగతి తెలిసిందే. గుండె పోటు రావడంతో.. మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి.. మరణించారు. దీంతో వైసీపీ పార్టీ లో విషాదం చోటు చేసుకుంది. అయితే.. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి నిన్న రాత్రి చివరగా దిగిన ఫోటో వైరల్‌ గా మారింది. తెలుగు దేశం పార్టీ నాయకులు జేసీ ప్రభాకర్‌ రెడ్డి కొడుకు అష్మిత్ రెడ్డి – నిస్చలతో పాటు… ఓ నిశ్చితార్ధ కార్యక్రమంలో నిన్న రాత్రి ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి పాల్గొన్నారు. అంతేకాదు…అష్మిత్ రెడ్డి – నిస్చల కలిసి… మంత్రి గౌతం రెడ్డి సెల్పీ కూడా దిగారు. ఆ ఫోటో ఇప్పుడు వైరల గా మారింది.

ఆయన జీవితంలో ఇదే చివరి సెల్ఫీ కావడం విశేషం. అయితే.. దీనిపై అష్మిత్ రెడ్డి కూడా స్పందించారు. ” నిన్న రాత్రి వివాహ వేడుకలో మాతో కలిసి ఆనందంగా గడిపిన గౌతమ్ రెడ్డి గారు.. నేడు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను” అంటూ జెసి అష్మిత్ రెడ్డి పేర్కొన్నారు. కాగా.. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి అంత్యక్రియలు ఎల్లుండి జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news