ఫేక్ ఫౌండేషన్‌లకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ : మంత్రి రోజా

-

మంత్రి రోజా మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మచిలీపట్నం పోర్టుకు చంద్రబాబు హడావుడిగా పూజ చేశారని ఆమె మండిపడ్డారు. అనుమతులు కూడా తీసుకోకుండానే ఆయన భూమి పూజ చేశారని మంత్రి రోజా ఆరోపించారు. శంకుస్థాపనలు చేయడం తప్ప.. తిరిగి వాటిని పూర్తి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు ఉండదని ఆమె ఎద్దేవా చేశారు. ఫేక్ ఫౌండేషన్‌లకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని బాబుపై మంత్రి రోజా సెటైర్లు వేశారు. చంద్రబాబు ఎక్కడో సెల్ఫీలు దిగడం కాదని.. గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నానితో టిడ్కో ఇళ్ల దగ్గర సెల్ఫీ దిగాలని ఆమె సూచించారు. వైసీపీ హాయంలో ఏపీలో నాలుగు పోర్టులు నిర్మించామని ఈ సందర్భంగా మంత్రి రోజా తెలిపారు.

రాబోయే 2024లో మరల వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుందాం అని తెలియజేశారు. ఈ సందర్భంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని అర్హత ఉండి పథకాలు అందని లబ్ధిదారులకు వెంటనే ఆ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version