హైదరాబాద్ వాడు గెంటేసినా.. మా కాళ్ళమీద మేము నిలబడుతున్నాం – మంత్రి రోజా

-

మూడు రాజధానుల అంశంపై వైఎస్ఆర్సిపి ప్రభుత్వం క్లారిటీ ఇస్తుంది. ఇంతకు ముందు వరకు మూడు రాజధానులు అని చెప్పుకొచ్చిన వైసిపి ప్రభుత్వం ఇప్పుడు విశాఖ నగరమే ఏపీ రాజధాని అని చెబుతోంది. సీఎం జగన్ కూడా త్వరలోనే విశాఖ నుంచి పాలన మొదలు పెడతానని చెప్పారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కి భారీగా పెట్టుబడులను రప్పించడం, ఉపాధి కల్పనే లక్ష్యంగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ( జీఐఎస్) నిర్వహించేందుకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం.

ఈ సమ్మిట్ లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కార్పొరేట్ దిగ్గజాలు, దేశవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు అంతర్జాతీయ కార్పోరేట్ సంస్థల ప్రతినిధులు విశాఖ చేరుకుంటున్నారు. అయితే అంతర్జాతీయ సదస్సుల నేపథ్యంలో తాజాగా మంత్రి రోజా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ” ఢిల్లీ వాడు వెక్కిరించినా, మద్రాస్ వాడు వెళ్లగొట్టినా, హైదరాబాద్ వాడు గెంటేసినా.. మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నాం.. పక్క రాష్ట్రాల రాజధానులకు ధీటుగా మా వైజాగ్ ను తీర్చిదిద్దుతాం – ” నిజమైన ఆంద్రోడు” అని ట్విట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news