ఇచ్చిన హామీలను అమలు చేస్తాము: మినిష్టర్ శ్రీధర్ బాబు

-

టిపిసిసి మేనిఫెస్టో కమిటీ సమావేశం చైర్మన్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన గాంధీభవన్లో సమావేశం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో ఇన్చార్జ్ దీపదాసమున్షితో పాటు ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి అలానే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏఐసిసి కార్యకర్తలు రోహిత్ చౌదరి మన్సూర్ అలీ ఖాన్ తో పాటుగా పలువురు పాల్గొన్నారు. ఒక మంచి ఎన్నికల మేనిఫెస్టో అందించగలిగాము. రాష్ట్రంలో అన్నిటి కంటే మంచి మేనిఫెస్టో ఇచ్చామని అన్నారు.

CM Revanth will stay away from Telangana for 10 days

మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు ఇచ్చామని అన్నారు అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు అమలు చేసే విధంగా అడుగులు వేస్తున్నామని ఆయన చెప్పారు. రెండో రోజు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీలో పది లక్షల ఆరోగ్య పథకాన్ని అందించాము అని అన్నారు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద ఎంతో విశ్వాసాన్ని చూపిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలు తొందరపాటుగా ఉన్నాయని అన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు శ్రీధర్ బాబు.

Read more RELATED
Recommended to you

Latest news