వరి ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

-

ధాన్యం కొనుగోలు అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అని జోస్యం చెప్పారు.మెజారిటీ సీట్లు గెలుస్తాం.. జూన్ 9వ తేదీన రాహుల్ గాంధీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని ధీమా వ్యక్తం చేశారు. ఇక, ప్రతిపక్ష పార్టీలు బురద జల్లే పిచ్చి పిచ్చి మాటలు మట్లాడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి ఇవాళ దీక్ష చేశారు.. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నిజాయితీగా పని చేస్తోంది.. ధాన్యం కొనుగోలు విషయంలో మాట్లాడే వారికి అవగాహన లేదు అని అన్నారు . మేము నిజాయితీగా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.

ఏప్రిల్ 1వ తేదీ కంటే ముందే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. 6, 919 కేంద్రాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.. గత ఏడాది 335 కేంద్రాలు ప్రారంభం కాగా.. మాజీ సీఎం కేసీఆర్ నిసిగ్గుగా మట్లాడుతున్నారు అని మండిపడ్డారు.ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం 2.7 లక్షల మెట్రిక్ టన్నులు.. గత ఏడాది 230 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు అని ఆయన తెలిపారు. కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధరకు ధాన్యం కొంటున్నాం.. కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకుని ఈ సారి ముందే కొనుగోలు కేంద్రాలు తెరిచాం అని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news