పేదల విషయంలో చంద్రబాబు చేసిన గాయాలు ఎప్పటికీ మానవు : సీఎం జగన్

-

పేదల విషయంలో చంద్రబాబు చేసిన గాయాలు ఎప్పటికీ మానవు అన్నారు ఏపీ సీఎం జగన్. గుడివాడలో నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో మాట్లాడారు. దాడులతో మీ బిడ్డ అదరడు.. బెదరడు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వవద్దని చంద్రబాబు అన్నారు. ఎన్నికల సంగ్రామంలో నాపై చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ ఇలా ఎంతో మంది దాడి చేస్తున్నారు. ఈ దాడులకు మీ బిడ్డ చెక్కు చెదరడు.

జగన్ మీద ఒక్క రాయి విసిరినంత మాత్రానా జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు.  ఈ తాటాకు చప్పళ్లుకు మీ బిడ్డ అదరడు.. బెదరడు.   మీకు సేవ చేయాలన్న సంకల్పం మరింత పెరుగుతుందే తప్పా ఏ మాత్రం తగ్గదు. నుదుటి మీద వారు చేసిన గాయంతో బయటపడ్డానంటే అంటే దానర్థం. దేవుడు బిడ్డ విషయంలో. ఇంకా పెద్ద స్క్రిప్ట్ రాశాడు అని దానర్థం. నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో కానీ, పేదల విషయంలో చంద్రబాబు చేసిన గాయాలు ఎప్పటికీ మానవు.

Read more RELATED
Recommended to you

Latest news