బాబుని నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టినట్టే : సీఎం జగన్

-

వ్యక్తి గత ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను చంద్రబాబ తాకట్టు పెట్టారని సీఎం జగన్ ఆరోపించారు. గుడివాడలో మేమంతా సిద్ధం సభలో మాట్లాడారు సీఎం జగన్.  హోదా ఏమైనా సంజీవనా..? అని బాబు అన్నారని గుర్తు చేశారు. “పిల్లనిచ్చిన మామపై చెప్పులు వేయించి ఎన్టీఆర్ చావుకు కారణమయ్యాడు. అవసరమైనప్పుడు ఎన్టీఆర్ ఫొటో బయటకు తీస్తాడు. దొంగ వాగ్డానాలు చేయడమే ఈ పెద్దమనిషికి తెలుసు. బాబు నమ్మడమంటే చెరువులో చేపలకు కొంగల్ని కాపలాలాగా పెట్టడమే. పులి నోట్లో తలపెట్టినట్టే” అని మండిపడ్డారు సీఎం జగన్.

చంద్రబాబు మార్క్ అంటే పచ్చ పాముల కాట్లు అన్నారు. మీ జగన్ చంద్రబాబు అండ్ కో కంపెనీ దాడి చేస్తోందన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే.. ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని అది ఇవ్వొద్దని ఎవ్వరూ చెప్పారని ప్రశ్నించారు జగన్. రెండు రూపాయలకు కిలో బియ్యం ఇవ్వవద్దని ఎన్టీఆర్ ని దింపేసి 5 రూపాయల 25 పైసలకు పెంచేసింది ఎవరు అని ప్రశ్నించారు సీఎం జగన్. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని గుర్తు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news