మిచెల్ జాన్సన్‌కు వింత అనుభవం.. హోటల్ గదిలో పాము!

-

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మిచెల్ జాన్సన్ ఊహించని షాక్‌ తగిలింది. తాజాగా మిచెల్ జాన్సన్ హోటల్ గదిలో పాము కలకలం సృష్టించింది. మిచల్ జాన్సన్ లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో ఇండియా క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటికే ఆ జట్టు తొలి మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓటమిపాలై, రెండో మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది.

క్యాపిటల్స్ తదుపరి మ్యాచ్ సెప్టెంబర్ 21న లక్నో వేదికగా జరగనుంది. ఇప్పటికే ఆటగాళ్లందరూ లక్నో చేరుకొని వారి వారి హోటల్ గదుల్లో సేద తీరుతున్నారు. ఈ తరుణంలో జాన్సన్ హోటల్ గదిలో పాము కలకలం సృష్టించింది. అందుకు సంబంధించిన ఫోటోలను జాన్సన్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. “ఇది ఎలాంటి పాము? ఎవరికైనా తెలుసా??” అంటూ క్యాప్షన్ జత చేశాడు. చూడడానికి, అది చిన్న పిల్లల ఉన్న ఆటగాళ్లు ఉండే 5 స్టార్ హోటల్ లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం లోపాలను ఎత్తిచూపుతోంది. ఒకవేళ ఏదైనా అనుకోని ఘటన జరిగి ఉంటే ఇండియాలో ఆటగాళ్లకు రక్షణ లేదు అని నిందించేవారు.

Read more RELATED
Recommended to you

Latest news