టోల్‌ సిబ్బందిపై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దాడి

-

మంచిర్యాల జిల్లా మందమర్రి టోల్​ప్లాజా వద్ద మంగళవారం అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. టోల్​ సిబ్బందిపై బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దాడి చేశారు. మంచిర్యాల వైపు నుంచి బెల్లంపల్లి వెళ్తున్న సమయంలో టోల్​ప్లాజా వద్ద సిబ్బంది ఎమ్మెల్యే కారును ఆపారు.

ఈ క్రమంలో అక్కడ చిన్న గొడవ చోటుచేసుకోవడంతో టోల్ సిబ్బందిపై ఎమ్మెల్యే చిన్నయ్య దాడికి దిగారు. టోల్‌ప్లాజా సిబ్బంది దురుసుగా ప్రవర్తించడం వల్లే తాను అలా రియాక్ట్ అయ్యానని ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news