మళ్ళీ నగరి వైసీపీలో రచ్చ.. సొంత పార్టీ నేతల మీద జగన్ కి రోజా ఫిర్యాదు !

-

స్దానిక సంస్ధ ఎన్నికలలో ఎలాగో ఒకలా గెలిచిన రోజాకు మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం కె జె కుమార్ వర్గం నుండి పెద్ద షాకే తగిలింది. అమెకు ఎదురు దెబ్బ తగిలింది..దీంతో పోలింగ్ బూత్  బయట ఆమె ఫైర్ అయ్యారు..గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనను ఓడించేందుకు ప్రయత్నించిన వారే మున్సిపల్ ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్ధులను ఓడించే ప్రయత్నం చేస్తున్నారని  నగరి, పుత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు గాను 14 రెబెల్స్ ను కూమార్ వర్గం రంగంలోకి దింపిందని ఆరోపించారు.

రెబెల్ అభ్యర్థులకు మద్దతుగా లేఖలు, వీడియోల ద్వారా ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు. ఈ రెండు మున్సిపాలిటీల్లో టీడీపీ విజయం సాధించినా ఫర్వాలేదు అని భావించి వైసీపీ అభ్యర్థుల ఓటమికి రెబెల్స్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. రెబెల్స్ గా బరిలో ఉన్నవారికి పెద్ద ఎత్తున డబ్బులు అందించారని వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె పోలింగ్ బూత్ బయటే ఒక లేఖ రాశారు. కెజె కూమార్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అధిష్టానానికి లేఖ రాశారు…గతంలో చాలా సార్లు చెప్పినా పార్టీ పెద్దలు పట్టించుకోలేదని ఈసారి మాత్రం చర్యలు తీసుకోవాల్సిందే అని లేఖలో పేర్కొన్నారు.   

Read more RELATED
Recommended to you

Latest news