అరవింద్ కాదు…మా శత్రువు రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ కవిత

-

తెలంగాణాలో మరో రెండు వారాలలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీ మరియు BRS లు ప్రచారాలలో చాలా జోరుగా వ్యవహరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక కీలక పోరు అయితే అధికార మరియు కాంగ్రెస్ ల మధ్యనే ఉండనుందని తేటతెల్లం అవుతోంది. ఇక తాజాగా ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్ తెలంగాణ రాజకీయ వర్గాలలో వైరల్ గా మారింది. ఒక మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరియు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ లలో ఎవరు మీ పార్టీకి శత్రువు అని ప్రశ్నించగా… ఈ ప్రశ్నకు కవిత సమాధానం ఇస్తూ ఖచ్చితంగా మాకు రేవంత్ రెడ్డి ప్రధాన శత్రువు అని కంఫర్మ్ చేసింది.

దీనికి మీడియా మరోసారి అదేంటి మిమ్మల్ని ఓడించింది అరవింద్ కదా అని అడగగానే… అయినా కీలక పాత్ర లేని బీజేపీ గురించి కన్నా.. కాంగ్రెస్ గురించి మేము ఆలోచించాలి అంటూ సమాధానం ఇచ్చింది కవిత.

Read more RELATED
Recommended to you

Latest news