సీఎం జగన్ ఆశీస్పులు అందుకున్న రోజా దంపతులు..!

-

ఏపీఐఐసీ చైర్ పర్సన్, నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా శుక్రవారం తన 18వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. ఈ క్రమంలో రోజా, సెల్వమణి దంపతులపై అక్షింతలు చల్లి సీఎం జగన్ వారిని దీవించారు. దీనికి సంబందించిన ఫోటోలను రోజా ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ‘‘వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుటుంబ సమేతంగా జగనన్నను కలిసి ఆశీర్వాదం తీసుకోవడం సంతోషంగా ఉంది’’ అని రోజా పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. అయితే సీఎం జగన్‌ను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. రోజా వైఎస్సార్‌సీపీలో చేరినప్పటి నుంచీ ప్రతి ఏటా వివాహ వార్షికోత్సవం నాడు జగన్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news