తెలంగాణ రాష్ట్రం నిరంకుశ పాలనలో మగ్గుతోందని, దొరల అహంకారానికి తెలంగాణ తల్లి, ప్రజలు బలయ్యారని ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. తన క్యాంపు కార్యాలయంలో సీతక్క ఈరోజు మాట్లాడుతూ.. అస్తవ్యస్త పాలన, గందరగోళ పరిస్థితుల నడుమ నిత్యం ఆత్మహత్యలు, అరాచకాలు, అత్యాచారాలతో రాష్ట్రం అట్టుడికిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 317 ప్రభుత్వ ఉత్తర్వును రద్దు చేయాలని డిమాండ్ చేస్తే అక్రమ అరెస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ములుగు: రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యే సీతక్క ఫైర్
By Naga Babu
-
Previous article
Next article