అయ్యబాబోయ్: BRS ఎమ్మెల్యే మనుషుల దౌర్జన్యం… ఎమ్మెల్యే కూడా కబ్జాకు సపోర్ట్ !

-

నేటి రాజకీయాలలో దోచుకోవడం సాధారణం అయిపోయింది. ఎమ్మెల్యే లేదా ఎంపీ అయితే ప్రజలకు మంచి చేసే విషయంపై దృష్టి పెట్టాలి .. కానీ కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం పేదల భూములను కబ్జా చేయడం, అన్యాయంగా అమాయకులను బెదిరించి సొమ్ము చేసుకోవడం జరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో జరిగిన సంఘటన దీనికి సరిగ్గా సూట్ అవుతుంది అని చెప్పాలి. వికారాబాద్ జిల్లా చన్గోముల్ గ్రామంలో BRS ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అనుచరులు ఈ గ్రామానికి చెందిన నవీన్ అనే 4 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు.

అంతే కాకుండా నవీన్ పై ఈ స్థలం కోసం దాడి కూడా చేశారట. కాగా ఈ విషయంలో ఎమ్మెల్యేగా ఉన్న మహేష్ రెడ్డి కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వారిని బెదిరించి పంపకుండా… దానికి విరుద్ధంగా మ్మెల్యే మహేష్ రెడ్డి ఎందుకు దీనిపై కేసులు కోర్ట్ లు అంటూ తిరగడం, మా వాళ్ళకే ఇచ్చేయండి అంటూ నవీన్ తో అనడంతో ఇది సంచలనంగా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news