అంగన్వాడి సంక్షేమానికి పెద్దపీట.. ఇదే నిదర్శనం : కవిత

-

నేడు అంగన్వాడి టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి, యూనియన్ ప్రతినిధులు ఎమ్మెల్సీ కవితను తన ఇంట్లో కలిశారు. ఈ సందర్భంగా కవితకు, తమ సమస్యలు పరిష్కరించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వారి ఉద్యోగ విరమణ వయస్సు 65 ఏండ్లకు పెంచడం పట్ల ఎమ్మెల్సీ కవిత ఆనందించారు. అంగన్వాడీల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు ఆమె. కవిత మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారన్నారు ఆమె. ముఖ్యంగా ఉద్యోగ విరమణ వయస్సు 65 ఏండ్లకు పెంచడమే కాకుండా ఉద్యోగ విరమణ సమయంలో అంగన్వాడీ టీచర్లకు రూ.లక్ష, హెల్పర్లకు రూ.50 వేలు అందించాలని నిర్ణయించాల గొప్పది అని వెల్లడించారు ఆమె.

పదవీ విరమణ తర్వాత వారికి ఆసరా పెన్షన్ కూడా మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అంగన్వాడీల భవిష్యత్తుకు భరోసానిస్తుందని అన్నారు ఆమె. ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమని స్పష్టం చేసాను కవిత. అంగన్వాడీలు చేస్తున్న సేవలకు సీఎం కేసీఆర్ గుర్తింపునిచ్చారని, ఇప్పటికే దేశంలో అత్యధిక వేతనాలు చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనేనని చెప్పారు. అనేక రాష్ట్రాల్లో అరకొర వేతనాలు చెల్లిస్తుంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత అంగన్వాడీలకు ప్రభుత్వం మూడుసార్లు వేతనాలు పెంచిందని గుర్తు చేశారు ఆమె.

 

 

Read more RELATED
Recommended to you

Latest news