బ్రేకింగ్ : గోరేటి వెంకన్న కు ఎమ్మెల్సీ పదవి !

-

తెలంగాణ లో కొత్తగా మూడు ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అవ్వడంతో ఆ పదవులు ఎవరికి దక్కుతాయో అనే దాని మీద ఆసక్తి నెలకొంది. తెలంగాణకు సంబంధించి దివంగత నాయని నరసింహా రెడ్డి అలానే రాములు నాయక్ అలానే కర్నె ప్రభాకర్ ల పదవి కాల పరిమితి ముగియడంతో ఈ ఏడాది ఆగస్టు నాటికి శాసనమండలిలో గవర్నర్ కోటా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ మూడు పదవులకి చాలా మంది పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

వారిలో ముఖ్యంగా కర్నె ప్రభాకర్ అలానే ముఖ్యమంత్రి ఓ ఎస్ డి దేశపతి శ్రీనివాస్, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణి, రవీందర్ రావు తదితరులు పేర్లు ముఖ్యంగా అనిపిస్తున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ రోజు సాయంత్రం జరిగే క్యాబినెట్ భేటీలో ఈ పేర్లను ఖరారు చేయనున్నట్లు చెబుతున్నారు. ఇందులో ఇద్దరు పేర్లు మాత్రం ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. అందులో ఒకరు ప్రజా గాయకుడు గోరేటి వెంకన్న కాగా మరొకరు సారయ్య అని తెలుస్తోంది. ఇది ఈ విషయం మీద ఈరోజు సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news