తెలంగాణ అభివృద్ధిపై మోదీ మాకు నీతులు చెబుతున్నారు – మంత్రి తలసాని

-

బిజెపిలో కుటుంబ పాలన లేదా? అని ప్రశ్నించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కర్ణాటకలో అవినీతిపై ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడడం లేదని విమర్శలు గుప్పించారు. పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగం పై స్పందించిన మంత్రి తలసాని మాట్లాడుతూ.. అధికార కార్యక్రమాలలో రాజకీయాలు మాట్లాడడం బాధాకరం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పై మోదీ తప్పుడు విమర్శలు చేశారని మండిపడ్డారు తలసాని.

వందే భారత్ రైలును ఎన్నిసార్లు ప్రారంభిస్తారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధిపై మోదీ మాకు నీతులు చెబుతున్నారని విమర్శించారు. సింగరేణిని అదానికి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి చెందకపోతే కేంద్రం ఇన్ని అవార్డులు ఎందుకు ఇస్తుందని నిలదీశారు. అవార్డులు ఇస్తారు కానీ నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. భారత్ బయోటెక్ దగ్గరకు వచ్చినప్పుడు కేసీఆర్ రాకుండా చేసింది ఎవరు? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news