నా మాటలు వక్రీకరించారు – ఎమ్మెల్యే సాయి ప్రసాద్

-

కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆరెకల్లో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న సాయి ప్రసాద్ రెడ్డి.. వైసిపి నేతలలో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని వ్యాఖ్యానించారు. అంతేకాదు నాయకుల పట్ల సీఎం వైఎస్ జగన్ కి అనుభవం లేదన్నారు. సీఎం జగన్ కి రెండవసారి అవకాశం ఇస్తే పూర్తి అనుభవం వస్తుందని అన్నారు సాయి ప్రసాద్ రెడ్డి.

అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో ఆ వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకున్నారు ఎమ్మెల్యే. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా జగన్ కి మరొకసారి అవకాశం ఇస్తే పూర్తి అనుభవం వస్తుందనే మాటలని వక్రీకరించారని అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం మాకు రాజకీయ భిక్ష పెట్టిందని.. ప్రాణం ఉన్నంతవరకు జగన్ వెంట ఉంటానని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news