దంచి కొడుతున్న రాజస్థాన్ ఓపెనర్లు… 6 ఓవర్లకే

-

మొదట బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ పిచ్ ను సరిగ్గా వాడుకుంటూ పరుగులు చేస్తోంది. ఎందుకో ఢిల్లీ అవకాశం వచ్చినా ఉపయోగించుకోలేకపోతోంది. టాస్ గెలిచి కూడా బౌలింగ్ తీసుకోవడం వారి బ్యాడ్ లక్ అని చెప్పాలి. ఇప్పుడు రాజస్థాన్ ఓపెనర్లు యాసస్వి జైస్వాల్ మరియు జాస్ బట్లర్ లు పవర్ ప్లే ను సమర్థవంతంగా వాడుకున్నారు అని చెప్పాలి. ఒకరి మీద ఒకరు పోటీ పడి మరీ పరుగులు దంచి కొడుతున్నారు. ముఖ్యంగా జైస్వాల్ అయితే మొదటి ఓవర్ లోనే 5 ఫోర్లు బాధి తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియచేశాడు.

వీరిద్దరూ పవర్ ప్లే లో 11.33 రన్ రేట్ తో 68 పరుగులు సాధించి రాజస్థాన్ కు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరి దెబ్బకు ఢిల్లీ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. బంతి ఎక్కడ వేయాలి అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. వీరు ఇదే విధంగా ఆడితే… రాజస్థాన్ 220 కి పైగానే పరుగులు చేయగలదు. మరి చూద్దాం ఏమి జరుగుతుందో ?

Read more RELATED
Recommended to you

Latest news