లోక్ సభ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ చేయడం లేదని మోడీ సెటైర్

-

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు చేశారు. ఓటమి భయంతోనే ఈ లోక్ సభ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ చేయడం లేదని ప్రధాని నరేంద్ర మోడీ సెటైర్ వేశారు.రాజస్థాన్‌లోని జాలోర్‌లో ఆదివారం ప్రధాని పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువు అయ్యారని అన్నారు. రాజ్యసభకు వెళ్లేందుకు కాంగ్రెస్ అగ్ర నేతలు రాజస్థాన్‌ను అడ్డాగా మార్చుకున్నారని విమర్శించారు.

గతంలో కేసీ వేణుగోపాల్, ఆ తర్వాత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఇప్పుడు సోనియాగాంధీ కూడా రాజస్థాన్‌ను రాజకీయాలకు వాడుకుంటున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ 60 సంవత్సరాలు అధికారంలో ఉందని గుర్తుచేశారు. ఒకప్పుడు ఆ పార్టీ 400 స్థానాలు గెలుచుకుందని, ఇప్పుడు మాత్రం అభ్యర్థుల్నే నిలబెట్టలేకపోతోందని ప్రధాని నరేంద్ర మోడీ ఎద్దేవా చేశారు. 400 మార్కుని ఈసారి ఎన్డీఏ అధిగమిస్తుందని మోడీ ధీమా వ్యక్తం చేశారు. కాగా, దేశ వ్యాప్తంగా 400 సీట్లే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news