చంద్రబాబు రెండో సారి వెన్నుపోటు ఎప్పుడు పొడిచారో తెలుసా?..ప్రధాని

-

కాంగ్రెస్ కి వ్యతిరేకంగా నాడు నందమూరి తారకరామారావు తెదేపాను స్థాపిస్తే… స్వలాభం కోసం అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో మరోసారి ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచారంటూ… ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. ఆదివారం ఏపీ భాజపా కార్యకర్తలతో నిర్వహించిన  టెలీకాన్ఫరెన్స్ లో మోడీ మాట్లాడుతూ… ఏపీ సీఎంపై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. చంద్రబాబు తన పదవిని కాపాడుకోవటం కోసమే ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజలకు చేసిన అవమానాన్ని ఎన్టీఆర్ ఎప్పటికి మరిచిపోరన్నారు. ఏపీ ప్రజలను తన మోసపూరిత హామీలతో చంద్రబాబు మోసం చేస్తున్నారన్నారు. తెదేపా అనుసరిస్తున్న వైఖరిని ప్రతి ఒక్కరూ ఎండగట్టాలని కార్యకర్తలు, నాయకులకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news