మోడి – జేసీ దివాకర్ రెడ్డి కలిసి గీసిన స్కెచ్.. ఏపీ రాజకీయాలని టోటల్ గా మార్చబోతోంది?

-

 

తెలుగుదేశం పార్టీ నాయకుడు దివాకర్ రెడ్డి మొత్తం అనంతపురం జిల్లానే చాలాకాలం పాటు ఒక ఊపు ఊపాడు. అసలు జిల్లాలో అతనికి ఎదురు లేదు అనుకుంటున్న సమయంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ సునామీ కొట్టుకుపోయాడు జేసీ. తన దుందుడుకు స్వభావం తో ఇప్పటికే ఎన్నో ఆరోపణలను ఎదుర్కొని చాలా కేసుల్లో ఇరుక్కున్న జెసి దివాకర్ రెడ్డి ఇప్పుడు గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే ఇతను భాజపా వైపు మారడానికి స్వయంగా ప్రధాని మోడీ కలగజేసుకున్నాడట.

 

ప్రస్తుతం ఏపీ రాజధాని విషయం హైలెట్ గా మారడం తో అతనికి ప్రతిపక్షం నుంచి ఒక సీనియర్ నేత అండ కావాల్సి వచ్చింది. అదే కాకుండా జెసి దివాకర్ రెడ్డి కూడా ఎప్పుడెప్పుడు పార్టీ మారుమా అని చూస్తున్న సమయంలో మోడీ నుంచి ఆఫర్ రావడంతోనే వెంటనే జంప్ అయిపోతున్నాడట. అయితే వీరిద్దరూ కలిసి జగన్ కోసం ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసినట్లుగా తెలుస్తోంది.

జగన్ 3 రాజధానులలో ఒకటిగా కర్నూలు ను ప్రకటించిన తర్వాత రాయలసీమ ప్రజల ఆనందానికి హద్దే లేకుండా పోయింది ఎన్నో దశాబ్దాల తర్వాత తమ ప్రాంతానికి ఒక రాజధాని వస్తుంది అన్న సంతోషం లో ఉన్న వారిపై వ్యతిరేకతా భావాన్ని నూరిపోసేందుకు జేసీని మోడీ సిద్దం చేస్తున్నాడట. అలాగే మరీ ముఖ్యంగా వారి సెంటిమెంటుతో కబడ్డీ ఆడేసుకోవడానికి మోడీ మరియు జేసి సిద్ధం అయిపోయారట.

Read more RELATED
Recommended to you

Latest news