ఆగస్టు 1న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ లో మోదీ ప్రసంగం

-

ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్​లైన్ హ్యాకథాన్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. 2020 ఆగస్టు 1 రాత్రి 7 గంటలనుంచి జరిగే ఈ కార్యక్రమంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ ఈ మేరకు ప్రకటన చేశారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఐ4ఈ సంస్థలు కూడా ఇందులో పాలుపంచుకుంటున్నాయి.

modi
modi

స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ నిర్వహణకు సంబంధించి జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్ అధ్యక్షత వహించారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కార్యక్రమం ఎంతో వినూత్నమైన ప్రక్రియ అని పోఖ్రియాల్ పేర్కొన్నారు. మనదేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను, సమస్యల పరిష్కారం కోసం సృజనాత్మక డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కసరత్తు జరిపేందుకు ఇదో వినూత్న మార్గమని చెప్పారు.

స్మార్ట్ ఇండియా హ్యాకథాన్​- 2020కి సంబంధించి తొలిదశ కార్యక్రమం గత జనవరిలో కళాశాల స్థాయి హ్యాకథాన్ ద్వారా ఇప్పటికే నిర్వహించారు. ఆ తర్వాత జాతీయ స్థాయిలో నిపుణులు, మదింపుదారులు మరింత వడపోత జరిపి, గ్రాండ్ ఫైనల్​లో పాల్గొనే బృందాలను ఎంపిక చేశారు. దేశంలో ప్రస్తుతం కొవిడ్​-19 సంక్షోభం నేపథ్యంలో గ్రాండ్ ఫైనల్​ను ఆన్​లైన్​లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news