మోడి – మోహన్ బాబుతో అరగంట మాట్లాడిన అత్యంత Important పాయింట్ ఇదే

-

ప్రముఖ సినీ నటుడు మరియు రాజకీయ వేత్త అయిన మోహన్ బాబు ప్రధాని నరేంద్ర మోడీని కలవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు మోడీని కలిసేందుకు విఫలయత్నం చేయగా కనీసం ఎమ్మెల్యే స్థానంలో కూడా లేని మోహన్ బాబుకి గంటకు పైగా తన సమయం ప్రధాని ఎలా ఇచ్చాడని అందరిలో అనేకానేక సందేహాలు నెలకొన్నాయి.

 

అయితే అందుకు కారణాలు ఏమున్నా మోడీ మోహన్ బాబుతో ఈ మీటింగ్ లో ప్రధానంగా రెండు విషయాలను గూర్చి చర్చించారు అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అందులో మొట్టమొదటిది తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి కొన్ని విషయాలు ఆయన అడిగినట్లుగా సమాచారం. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి జాతీయస్థాయిలో కొన్ని అద్భుతమైన చిత్రాలు వల్ల మంచి గుర్తింపు రాగా ఇండస్ట్రీలోని చాలామంది కూడా రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. బహుశా ఇదే విషయమై మోడీ మోహన్ బాబు తో చర్చించి ఉంటారని అంతా అనుకుంటున్నారు.

మరొక విషయానికి వస్తే ఇప్పటికే రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ఏపీ రాజధాని విషయం గురించి కూడా మోదీ మోహన్ బాబు తో అంతర్గత పరిస్థితులపై చర్చించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏపీ బీజేపీ తాము మూడు రాజధానులు కాన్సెప్ట్ కు వ్యతిరేకమని ప్రకటించిన సమయంలోనే మోదీ తో మోహన్ బాబు సమావేశం కావడం గమనార్హం. చూద్దాం కలెక్షన్ కింగ్ త్వరలోనే భాజపా కండువా కప్పుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయేమో.

Read more RELATED
Recommended to you

Latest news