నేడు సీఎం జగన్ తో… మోహన్ బాబు సమావేశం !

-

ఏపీలో టాలీవుడ్ సినీ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పర్యటించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుండి ఇండిగో విమానంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. దీంతో మోహన్ బాబుకు ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు ఆయన అభిమానులు. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో మీడియాతో ఈ సందర్భంగా మోహన్ బాబు ముచ్చటించారు.

విజయవాడ రావడం తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆత్మీయులను కలిసేందుకు విజయవాడ కి వచ్చానని వెల్లడించారు మోహన్ బాబు. ఎయిర్ పోర్ట్ నుంచి పెదపారుపూడి మండలం వానపాముల గ్రామానికి మోహన్ బాబు బయల్దేరి వెళ్లారు. ఏపీ అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తల్లి రంగనాయకమ్మ ఇటీవల మృతి చెందటంతో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి విజయవాడ వచ్చారు మోహన్ బాబు. అనంతరం అక్కడి నుంచి ఏపీ సీఎం జగన్ ను నివాసానికి మోహన్ బాబు వెళతారని సమాచారం అందుతోంది. సిఎం జగన్ ను కలిసి.. టాలీవుడ్ పరిశ్రమ సమస్యలపై సిఎం జగన్ తో మోహన్ బాబు చర్చించే ఛాన్స్ కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news