మోహ‌న్‌బాబుకు ఆహ్వానం రాకుండా అడ్డుకున్నారు.. విష్ణు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధ‌ర‌ల విషయంలో టాలీవుడ్ ప్ర‌ముఖులు ఇటీవల సీఎం జ‌గ‌న్ తో స‌మావేశం అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, ప్ర‌భాస్, మ‌హేశ్ బాబు, రాజ‌మౌళి, కొర‌టాల శివ, ఆర్ నారాయ‌ణ మూర్తితో పాటు ప‌లువురు ఈ స‌మావేశానికి హాజ‌రు అయ్యారు. అయితే ఈ స‌మావేశం పై మా అధ్యక్షుడు మంచు విష్ణు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌భుత్వంతో సినీ స్టార్ల స‌మావేశానికి సంబంధించిన ఆహ్వానం మోహ‌న్ బాబు వ‌ర‌కు రాకుండా కొంత మంది అడ్డుకున్నార‌ని అన్నారు.

కాగ ఈ రోజు ఏపీ సీఎం జ‌గ‌న్ తో మంచు విష్ణు లంచ్ మీటింగ్ నిర్వ‌హించారు. ఈ భేటీ అనంత‌రం విష్ణు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌భుత్వంతో స‌మావేశానికి.. మోహ‌న్ బాబు హాజ‌రు కావాల‌ని ప్ర‌భుత్వం ఆహ్వానం పంపినా.. అది మోహ‌న్ బాబు వ‌ర‌కు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. టాలీవుడ్ అంతా ఒకే కుటుంబం అంటూనే స‌మావేశాల‌కు త‌మ కుటుంబాన్ని కొంత మంది దూరం పెడుతున్నార‌ని అన్నారు.

కాగ సీఎం జ‌గ‌న్ తో ప్ర‌స్తుతం జ‌రిగిన స‌మావేశం పూర్తిగా వ్య‌క్తిగ‌తం అని అన్నారు. గ‌తంలో కూడా తాను జ‌గ‌న్ తో చాలా సార్లు స‌మావేశం అయ్యాన‌ని అన్నారు. ఈ స‌మావేశానికి.. రాజకీయం గానీ, సినిమా విషయాల‌కు సంబంధం లేద‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news