కూతుర్ని వేధిస్తున్నాడని అల్లుడిని కిడ్నాప్ చేసి చంపేశారు !

-

హైదరాబాద్ శివార్లలో మొయినాబాద్ లో జరిగిన మర్డర్ కేసు ను పోలీసులు చేధించారు. షేక్ సల్మాన్ అనే వ్యక్తిని దుండగులు మొయినాబాద్ లో హత్య చేశారు. అయితే అతనిని హత్య చేసింది భార్య, బావమారిది పిల్లనిచ్చిన అత్తామామలే అని పోలీసులు గుర్తించారు. కూతురు ని హింసిస్తున్నాడు అనే అల్లుడు సల్మాన్ ను హత్య చేసేందుకు ప్లాన్ చేశారు.

ప్లాన్ చేసిన ప్రకారమే తనను కిడ్నాప్ చేసి కొట్టి చంపి మొయినాబాద్ దగ్గర్లో పడేశారు భార్య కు సంబంధించిన కుటుంబ సభ్యులు. ఈ హత్యకు పాల్పడింది సల్మాన్ బావమరిది దస్తగిరి మామ జిలాని భార్య ఫర్హాన్ బేగం, అత్త ఫర్జానా అని పోలీసుల గుర్తించారు. పెళ్లి అయిన నాటి నుండి భార్యను బాగా వేధిస్తూ ఉండడంతో చంపాలని నిర్ణయం తీసుకుని చంపేసినట్టు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. 

Read more RELATED
Recommended to you

Latest news