ముగ్గురు పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య.. !

-

యాదాద్రి భువనగిరి: చౌటుప్పల్‌ రాంనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలకు ఉరివేసి తల్లి బలవన్మరణానికి పాల్పడ్డారు. రామ్ నగర్‌లో వెంకటేశ్, ఉమారాణి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు ఆడ పిల్లలున్నారు. గురువారం రాత్రి భర్త వెంకటేశ్ ఇంట్లో లేని సమయంలో తల్లి ఉమారాణి.. తన ముగ్గురు పిల్లలకు ఉరివేశారు. తాను ఆత్మహత్య చేసుకున్నారు. అయితే వారిలో ఇద్దరు చిన్నారులు మరణించగా, ఉరి జారడంతో మరో అమ్మాయి మృత్యువు నుంచి బయటపడింది. అయితే భర్త వెంకటేశ్ మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడంలేదని స్థానికులు చెప్పారు. అంతేకాదు కొంత కాలంగా వీరు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లు తెలిపారు.

గురువారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులను తల్లి తొర్పునూరి ఉమారాణి (32), పిల్లలు హర్షిణి (14), లక్కీ (10)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news