14 సీట్లు కాంగ్రెస్ కి వస్తే.. రాజకీయ సన్యాసం చేస్తాను: మాజీ మంత్రి

-

కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు కనుక వచ్చే ఉంటే రాజకీయ సన్యాసం చేస్తానని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సవాల్ చేసారు. సోమవారం మోత్కుపల్లి నరసింహులు బషీర్బాగ్ ప్రస్తుత క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాదిగతో పాటుగా మాట్లాడారు. 80 లక్షల జనాభా ఉన్న మాదిగల కి ఒక్క పార్లమెంట్ స్థానం ఎందుకు ఇవ్వలేదు రేవంత్ రెడ్డి చెప్పాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు డిమాండ్ చేశారు.

అలానే ఆయన మాట్లాడుతూ మా జాతి పరిస్థితి ఏంటో చెప్పాలని అన్నారు కాంగ్రెస్ పార్టీలో ఒకే కుటుంబానికి మూడు సీట్లు ఇవ్వడం న్యాయమా అని మండిపడ్డారు. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను ఇది గమనించాలని అన్నారు అన్నీ మీ కులానికే టికెట్ ఇచ్చుకున్నారని మిగతా జాతులకి సీట్లు కేటాయించలేదని అన్నారు రేవంత్ రెడ్డి వల్లనే మాదిగులో అన్యాయం జరిగిందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news