పౌరుషం ఉంటే ఈటలపై కేటీఆర్ ను పోటీకి దింపు : కెసిఆర్ కు బిజేపి ఎంపీ సవాల్

-

సిఎం కెసిఆర్, కేటీఆర్ లపై బిజేపి ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ లో ప్రచారంలో భాగంగా ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. నీకు పౌరుషం ఉంటే కేటీఆర్ ను ఈటల రాజేందర్ పై పోటీ చేయించు అని సవాల్ విసిరారు. జమ్మికుంటలో ఎటు చూసిన కెసిఆర్ బొమ్మలు, టిఆర్ఎస్ బొమ్మలే వున్నాయని.. అక్కడే అర్థం అవుతుంది కెసిఆర్ ఓటమి చెందుతున్నారని చురకలు అంటించారు. కెసిఆర్ కు ఓటమి భయం పట్టుకుందని.. దుబ్బాక, GHMC ఎన్నికల తరువాత టిఆర్ఎస్ పతనం మొదలైందన్నారు. హుజూరాబాద్ ఎన్నిక తరువాత టిఆర్ఎస్ పేకమేడ లెక్క కూలీ పోతుందని జోష్యం చెప్పారు.

కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసేందుకు ఈటల అడ్డు వస్తున్నాడని.. అందుకే ఈటలను పక్కకు పెట్టారని పేర్కొన్నారు. ఈటలను పక్కకు పెడితేనే ఉప ఎన్నిక వచ్చిందన్నారు. కొడుకు భవిష్యత్ కోసమే ఈటలకు అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు. ఈ ఎన్నిక కెసిఆర్ సన్ స్ట్రోక్ తో వచ్చిందన్నారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయడం కోసం అనేక తిప్పలు పడుతున్నారని… ఎన్ని చేసినా కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం ఓ కల అని ఎద్దేవా చేశారు. కరోనా కష్ట కాలంలో కొడుకు కోసం ఉద్యమ కారునిపై లేని పోని ఆరోపణలు చేశారని మండిపడ్డారు. హుజూరాబాద్ నియోజక ప్రజల ఆత్మ గౌరవం దెబ్బ తీసిన కెసిఆర్ ఆహంకారంకు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దం అయ్యారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news