కేసీఆర్‌ను కామారెడ్డిలో ఓడించి పంపిస్తాం : ఎంపీ ఆర్వింద్‌

-

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన ఆ పార్టీ మొదటి విడత అభ్యర్థుల జాబితాను చూసిన తర్వాత తాను చాలా సంతోషంగా ఉన్నానని నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ అన్నారు. నాలుగు నియోజకవర్గాలు మినహా మిగతా వాటికి కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.

BJP MP Arvind slams MLC Kavitha after TRS cadres vandalise his home in  Hyderabad - India Today

ఓటమి భయంతోనే కేసీఆర్‌ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని విమర్శించారు. గజ్వేల్‌ నుంచి ఈటల రాజేందర్‌ పోటీ చేస్తానని ప్రకటన చేయడంతో… కేసీఆర్‌ ముందు జాగ్రత్తగా రెండు చోట్ల పోటీకి దిగుతున్నారని అన్నారు. కామారెడ్డి నుంచి కాస్త ముందుకు వస్తే.. చిత్తు చిత్తుగా ఓడించేవాడినంటూ కామెంట్ చేశారు. బీఆర్‌ఎస్‌ లిస్టును చూస్తుంటే నిజామాబాద్‌ జిల్లాలో బీజేపీ క్లీన్ స్వీప్‌ చేయడం ఖాయమన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news