తెలంగాణ జోలికి రావద్దు – సజ్జలపై ఎంపీ అరవింద్ ఫైర్

-

ఆంధ్ర ప్రదేశ్ – తెలంగాణ మళ్లీ ఒకటి కావాలన్న ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్. సజ్జల చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తన సలహాదారుడిని మార్చుకోవాలని.. అసలు సజ్జలను ఎవరైనా సలహాదారుడిగా పెట్టుకుంటారా? అని ప్రశ్నించారు.

“ఒకప్పుడు ఆంధ్ర.. తమిళనాడు నుంచి విడిపోయింది. ఏపీని మళ్లీ తమిళనాడులో కలపండి. సజ్జల రామకృష్ణ ఏమన్నా ఎమ్మెల్యేనా. జగన్ సలహాదారుని మార్చుకో. ఇలాంటి వాళ్లను సలహాదారుడుగా జగన్ పెట్టుకుంటాడా?. మా తెలంగాణపై ఎందుకు పడతారు. మళ్లీ ఆంధ్ర ను తమిళనాడులో కలుపుకోవాలని చెప్పాలి.. అంతే తప్ప తెలంగాణ జోలికి రావద్దు ” అని ఎంపీ అరవింద్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news