సిబిఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి

-

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి హైదరాబాద్ కోటి లోని సిబిఐ కోర్టుకు విచారణకు హాజరయ్యారు. 2019 మార్చి 15న వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును కడప నుంచి హైదరాబాద్ సిబిఐ కోర్టుకు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో సిబిఐ ఈ కేసులో ఇప్పటికే 248 మంది వాంగ్మూలం సేకరించింది.

వాంగ్మూలం ఆధారంగా అవినాష్ రెడ్డి ని నేడు ప్రశ్నిస్తుంది సిబిఐ. అధికారులు అవినాష్ రెడ్డిని విచారిస్తున్న నేపథ్యంలో ఆ కార్యాలయం వద్దకు ఆయన అనుచరులు భారీగా చేరుకున్నారు. అయితే వారిని విచారణ జరుగుతున్న చోటుకు అనుమతించకపోయినప్పటికీ వారు అక్కడే వేచి చూస్తున్నారు. సిబిఐ ఎస్పీ రాంసింగ్ ఆధ్వర్యంలో అవినాష్ రెడ్డిని విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news