బ్రేకింగ్; మాజీ సిఎం పరిస్థితి విషమం…?

-

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వయో భారం తో ఆయనకు అనారోగ్య సమస్యలు ఒక దాని తర్వాత ఒకటి బయటపడుతూనే ఉన్నాయి. సమాజ్ వాదీ పార్టీని స్థాపించిన 80 ఏళ్ళ ములాయం పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉందని సమాచారం.

ఆయన తాజాగా తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలోని మేదాంత ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ఆయన కుమారుడు, మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ ఆయనతో ఉన్నట్టు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా ఆయన ఉదరకోశ సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యంపై అక్కడి వైద్యులు కూడా ఏమీ చెప్పడం లేదు. వైద్య పరిక్షలు అన్నీ నిర్వహించినట్టు చెప్పారు వైద్యులు. ప్రస్తుతం ఆయనను చూడటానికి తమ్ముడు శివ పాల్ సింగ్ యాదవ్, కోడలు డింపుల్ యాదవ్ ఆస్పత్రికి వెళ్ళారు.

Read more RELATED
Recommended to you

Latest news