టీఆర్ఎస్ నేత మీద మర్డర్ అటెంప్ట్.. ఫైరింగ్ కలకలం ?

-

పెద్దపల్లి జిల్లాలో ఒక టీఆర్ఎస్ నేత మీద జరిగిన హత్యాయత్నం కలకలం రేపుతోంది. జిల్లాలోని కాల్వ శ్రీ రాంపూర్ మండల కేంద్రానికి చెందిన దేవయ్య అనే టీఆర్ఎస్ నాయకుడి మీద అర్ధరాత్రి సమయంలో హత్యాయత్నం చేసారు కొందరు దుండగులు. కత్తులు, ఒక రివాల్వర్ తో దేవయ్య ఇంటి వద్దకు వెళ్ళిన దుండగులు ఆయన్ని బెదిరింపులకు గురి చేశారు.

గన్ తో కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. అయితే ఒక్కసారిగా జరిగిన పరిణామానికి హతాశుడయిన దేవయ్య పెనుగులాటలో రివాల్వర్ను విసిరి పారేయడంతో దుండగులు భయపడి పరారయ్యారు. అయితే ఈ ఘర్షణకు ఓ స్థల వివాదమే కారణమని సమాచారం అందుతోంది. స్థల వివాదం వ్యవహారంలో బెదిరించేందుకే వారు వచ్చి ఉంటారని భావిస్తున్నారు. భూవివాదానికి కారణం అయిన వ్యక్తిని కాల్వశ్రీరాంపూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news