కుమార్తె బాయ్ ఫ్రెండ్ హత్య చేసిన తండ్రి… ఇద్దరిని ఒకే రూం లో ఉండటం చూసి…

-

కేరళతో ఘోరం జరిగింది. ప్రియురాలి కలిసేందుకు వచ్చిన ప్రియుడిన దారుణంగా చంపాడు ప్రియురాలి తండ్రి. కేరళలోని తిరువనంతపురం పెట్టలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. అనీష్ జార్జి అనే 19 ఏళ్ల కుర్రాడు తన ప్రియురాలి ఇంటికి అర్థరాత్రి సమయంలో వెళ్లాడు. ప్రియురాలి రూంలో రహస్యంగా ఉన్నాడు. ఇదే సమయంలో సదరు యువత తండ్రి లాలాన్ కు మెలుకువ వచ్చింది. అయితే కూతురు రూం నుంచి వింత శబ్ధాలు రావడంతో … రూం డోర్ ఓపెన్ చేయాల్సిందిగా కోరాడు. అయితే తలుపును ఎంత కొట్టినా.. కూతురు గది డోర్ ఓపెన్ చేయలేదు. దీంతో డోర్ ను బద్దలు కొట్టి రూంలోకి వెళ్లాడు లాలన్. ఆ సమయంలో కూతురుతో ఉన్న యువకుడిని చూసి కోపోద్రిక్తుడయ్యాడు. పక్కనే ఉన్న కత్తిని తీసి అనీష్ జార్జిని పొడిచి చంపాడు. తీవ్రంగా గాయాలపాలై రక్త స్రావం కావడంతో స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతను మరణించారని వైద్యులు ధ్రువీకరించారు.

అనిష్ ను చంపిన తర్వాత లాలన్ పోలీసుల వద్ద లొంగిపోయాడు. అయితే దొంగ అనుకుని తాను ఈ పనిని చేశానని చెబుతున్నాడు. అయితే గతంలో లాలన్, అనీష్ మధ్య ఎదైనా తగాదాలు ఉన్నాయా.. అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news