వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని దారుణం… ప్రియుడితో కలిసి భర్త హత్య..!

-

సమాజంలో నానాటికి కట్టుబాట్లు, కుటుంబ విలువలు పతనమవుతున్నాయి. క్షణికానందం కోసం పచ్చని కుటుంబాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు. వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ.. అడ్డుగా ఉన్నవారిని అడ్డు తొలగించేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. కట్టుకున్న వారిని అతికిరాతకంగా హత్యలు చేస్తున్నారు. కటకటాల పాలవుతున్నారు. తాజా ఇలాంటి సంఘటనే రంగారెడ్డి జిల్లా పూడూరు మండలంలో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిందో భార్య. ఈ సంఘటన పూడురు మండలం చన్గోముల్ గ్రామంలో జరిగింది. స్థానిక ఎస్ఐ చెప్పిన వివరాల ప్రకారం.. గ్రామాకి చెందిన ఎరుకల వెంకటయ్య(30), మాధవి(26) దంపతులు. కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన శేఖర్ తో మాధవి అక్రమసంబంధం ఏర్పరుచుకుంది.

ఈవిషయం తెలిసి వెంకటయ్య పలు మార్లు భార్య మాధవిని హెచ్చిరించాడు. అయినా ఫలితం లేకపోయింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తెలిసి భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించారు మాధవి, శేఖర్లు. ఈక్రమంలోనే వెంకటయ్యను కిరాతంగా హత్య చేశారు. గ్రామానికి సమీపంలో ఉన్న పత్తి చేనులో వెంకటయ్యను చంపేశారు. వెంటకయ్య కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు వివారాలు సేకరిచారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు పోలీసులు

Read more RELATED
Recommended to you

Latest news